సామాన్యులపై వరస దెబ్బలు పడుతున్నాయి. నిత్యావసరాల వస్తువుల ధరలు పెరగడంతో పేదలు, మధ్యతరగతి ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే కూరగాయలు కొనుగోలు చేయలేక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పాటు ఇప్పుడు వంటనూనెల ధరలు పెరుగుతాయన్న వార్తలు సామాన్యులను అయోమయంలో పడేస్తుంది. ఇక వంటింట్లో ప్రతి వస్తువూ ఖరీదైనదిగా మారుతుందన్న భయంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
వాణిజ్య ఒప్పందం…
రష్యా – ఉక్రెయిన్ యుద్ధం కారణంగా వంట నూనెల ధరలు ఇప్పటికే పెరిగాయి. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం రెండు దేశాలతో వాణిజ్య ఒప్పందాన్నిరద్దు చేసుకోవడంతో ఆయిల్ ధరలు పెరిగే అవకాశమున్నాయంటున్నారు. సన్ ఫ్లవర్ ధర పదిహేను శాతం పెరిగే అవకాశముందన్న అంచనాలు వినపడుతున్నాయి. ఇప్పటికే ధరల పెరుగుదలతో అవస్థలు పడుతున్న ప్రజలు ఇక వంట నూనెల ధరలు కూడా పెరిగితే ఇక తిండితిప్పలకు అల్లాడాల్సిందేనని అంటున్నారు మధ్యతరగతి ప్రజలు.