Crime: మధ్యప్రదేశ్లోని కట్నీ నగరంలో రెవిన్యూ శాఖలో పట్వారీ అధికారిగా పనిచేస్తున్న గజేంద్ర సింగ్ను లంచం(Bribe) తీసుకుంటుండగా లోకాయుక్త (Lokayukta Special Police Establishment) పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
లోకాయుక్త సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సంజయ్ సాహు కథనం మేరకు..”ఒక పని విషయంలో గజేంద్ర సింగ్ (Gajendra Singh) తనను 5000 రూపాయలు లంచం డిమాండ్ చేస్తున్నాడని బర్ఖెడా గ్రామానికి చెందిన ఒక వ్యక్తి లోకాయుక్తకు ఫిర్యాదు చేసాడు. దానిలో భాగంగానే పట్వారీ గజేంద్ర సింగ్ను పట్టుకోడానికి తాము వేసిన ట్రాప్ లో అతను పడ్డాడని ఎస్పీ తెలిపారు. తన ప్రైవేట్ కార్యాలయంలో రూ. 5,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా గజేంద్ర సింగ్ ను పట్టుకున్నామని.. అయితే తమను చుసిన గజేంద్ర సింగ్ లంచం గా తీసుకున్న రూ. 5000 ని మింగేశాడని తెలిపారు.
వెంటనే గజేంద్ర సింగ్ ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి తాను మింగేసిన లంచం డబ్బులను బలవంతంగా కక్కించారు లోకాయుక్త పోలీసులు. రెవిన్యూ అధికారి గజేంద్ర సింగ్ ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నాడని వైద్యులు తెలిపారు.
A patwari in Katni, allegedly swallowed money he had accepted as a bribe after noticing a team of the Lokayukta's Special Police Establishment pic.twitter.com/AgsOyDsnGM
— Anurag Dwary (@Anurag_Dwary) July 24, 2023