బీఆర్ఎస్ మహీపాల్ రెడ్డి ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. పటాన్ చెర్వు ఎమ్మెల్యే గూడెం మహీపాల్ రెడ్డి పెద్ద కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి మరణించడంతో ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన విష్ణువర్థన్ రెడ్డి ఈరోజు తెల్లవారు జామున చికిత్స పొందుతూ మరణించారు.
అనారోగ్యానికి గురై…
గత కొద్ది రోజులుగా విష్ణువర్థన్ రెడ్డి కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన వయసు ముప్ఫయి సంవత్సరాలు. ఆయనకు గుండెపోటు రావడంతో ఆసుపత్రిలో చేర్చారు. ఆయన రెండు కిడ్నీలు పాడవ్వడం, కామెర్లు సోకడంతో పరిస్థితి విషమించిందని వైద్యులు తెలిపారు. దీంతో తాము ఎంత ప్రయత్నించినా బతికించలేకపోయామని వైద్యులు తెలిపారు. ఎమ్మెల్యే మహాపాల్ రెడ్డి కుటుంబానికి మంత్రి హరీశ్ రావుతో పాటు పలువురు సంతాపాన్ని తెలిపారు.