వర్షాల దెబ్బకు అనేక ఆధ్యాత్మిక ప్రాంతాలు నీటమునిగిపోతున్నాయి. తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లాలో వాగులు, వంకలు పొంగి పొరలుతున్నాయి. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు అనేక ఆస్తులు నీటీపాలయ్యాయి. ఇందులో భాగంగా ములుగు జిల్లాలోని మేడారంలోనూ అవే పరిస్థితులు ఏర్పడ్డాయి. సమ్మక్క సారలమ్మ గద్దెలు కూడా వరద నీటిలో మునిగిపోయాయి.
గద్దెలు మునగడంతో….
సమ్మక్క సారలమ్మ ఆలయంతో పాటు అనేక చోట్ల మూడు అడుగుల మేర నీరు చేరుకుంది. అనేక మంది ఆదివాసీలు నిరాశ్రయులయ్యారు. హెలికాప్టర్ల సాయంతో బాధితులను ఎన్డిఆర్ఎఫ్ టీంలు రక్షించే ప్రయత్నం చేస్తున్నాయి. జంపన్నవాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో గ్రామమంతా నీట మునిగింది. దీంతో అధికారులు అక్కడ సహాయక చర్యలు చేపట్టారు. మెదక్ జిల్లాలోని ఏడుపాయల వద్ద వనదుర్గ అమ్మవారి ఆలయంలోకి కూడా వరద నీరు చేరడంతో ఆలయంలో దర్శనాలను నిలిపివేశారు.