కాపు రిజర్వేషన్ల పోరాట సమితి నేత ముద్రగడ పద్మనాభంను మంత్రి గుడివాడ అమరనాథ్ కలిశారు. ఆయనతో తాజా రాజకీయ అంశాలపై చర్చించినట్లు తెలిసింది. గత కొంతకాలంగా ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరుతారన్న ప్రచారం జరుగుతుంది. పవన్ కల్యాణ్ కు పోటీగా ఆయన నిలబడతారని కూడా కొందరు అంటున్నారు.
వైసీపీలో చేరతారని…
జనసేన అధినేత పవన్ కల్యాణ్కు కూడా ముద్రగడ ఘాటు లేఖలు రాయడంతో ఈ ప్రచారం మరింత బలపడింది. అయితే ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? ఎంపీగానా లేదా తన కుమారుడిని రాజకీయ అరంగేట్రం వైసీపీ ద్వారా చేయిస్తారా? అన్న చర్చ కూడా జోరుగా సాగుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో మంత్రి గుడివాడ అమరనాధ్ కలవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. అయితే మంత్రి గుడివాడ మాత్రం తాము ఫ్యామిలీ ఫ్రెండ్స్ మని, అందుకోసమే కలిశామని, రాజకీయాలేవీ చర్చించలేదని పైకి చెబుతున్నారు.