భారీ వర్షాలకు ప్రాజెక్టులు నిండుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న జోరు వానలకు ప్రాజెక్టులు కళకళలాడుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో అధికారులు ప్రాజెక్టు గేట్లను ఎత్తివేశారు. ప్రాజెక్టులోని లోని లక్ష్మీ బ్యారేజీ 85 గేట్లు ఎత్తివేశారు. దీంతో చూసేందుకు అక్కడకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు.
గేట్లు ఎత్తివేత…
మేడిగడ్డ బ్యారేజీకి ప్రస్తుతం ఇన్ ఫ్లో 8.21 లక్షల క్యూసెక్కులుగా ఉంది. అన్నారం బ్యారేజీకి గోదావరి నుంచి 7.61 లక్షలు వరద మానేరు నుంచి అన్నారం బ్యారేజీకి 5.33 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉంది. అన్నారం బ్యారేజీకి ఉన్న మొత్తం అరవై ఆరు గేట్లను అధికారులు ఎత్తి వరద నీటిని కిందకు వదలి పెడుతున్నారు. ప్రస్తుతం అన్నారం బ్యారేజీ నుంచి 12.95 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.