గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులన్నీ నిండుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ఎప్పుడైనా వరద నీరు గ్రామాల్లోకి ప్రవేశించే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. గోదావరికి వరద పోటెత్తుతుంది. దీంతో భద్రాచలం వద్ద 46.5 అడుగులు, ధవళేశ్వరం ప్రాజెక్టు వద్ద ప్రస్తుతం ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 13.57 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.
రెండో ప్రమాద హెచ్చరిక….
దీంతో రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. ప్రాజెక్టులకు సమీపంలోని 42 మండలాలు, 458 గ్రామాల ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. గోదావరి ఎప్పుడైనా గ్రామాల్లోకి ప్రవేశించే అవకాశముందని తెలిపింది. ఇప్పటికే ముంపునకు గురైన గ్రామాలను గుర్తించిన అధికారులు అక్కడ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ బృందాలను ఏర్పాటు చేశారు. గ్రామాల్లో చాటింపు వేయిస్తున్నారు. ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.