వర్షాల్లోనూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర కొనసాగుతుంది. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో పాదయాత్ర జరుగుతుంది. ఇప్పటి వరకూ నారా లోకేష్ 2,197 కిలోమీటర్ల దూరం నడిచారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. రవి ఫంక్షన్ హాలులో రాత్రి బస చేసిన నారా లోకేష్ సాయంత్రం నాలుగు గంటలకు రవిప్రియ ఫంక్షన్ హాలు నుంచి 168వ రోజు పాదయాత్ర ప్రారంభం కానుంది. అక్కడ మంగమ్మ కళాశాల వద్ద యువతతో లోకేష్ సమావేశం అయి వారి సమస్యలపై చర్చించనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
శిలాఫలకాన్ని…
అనంతరం త్రోవగుంట వద్ద 2,200 కిలోమీటర్ల మైలురాయికి లోకేష్ పాదయాత్ర చేరుకుంటుంది. అక్కడ లోకేష్ శిలాఫలకాన్ని ఆవిష్కరించనున్నారు. అనతరం పాదయాత్ర సంతనూతలపాడు నియోజకవర్గంలోకి ప్రవేశించనుంది. రాత్రి 6.35 గంటలకు ఏడుగుండ్లపాడు వద్ద స్థానికులతో సమావేశం కానున్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు.
వరస సమావేశాలు…
రాత్రి 8.35 గంటలకు నారా లోకేష్ సీతారాంపురం కొష్టాల వద్ద పొగాకు రైతులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. అనంతరం రాత్రి 9.35 గంటలకు మద్దిపాడులో స్థానికులతో సమావేశమవుతారు. అనంతరం రాత్రి 10.35 గంటలకు వెల్లంపల్లిలో మహిళలతో సమావేశం కానున్నారు. ఆ తర్వాత రాత్రి 11.35 గంటలకు గుండ్లాపల్లిలో గ్రానైట్ కార్మికులతో సమావేశమై అక్కడే రాత్రికి బస చేయనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. లోకేష్ పాదయాత్రకు భారీ స్పందన లభిస్తుంది. పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.