రానున్న లోక్సభ ఎన్నికల్లో మోదీ స్పీడ్ కు అడ్డుకట్ట వేయడానికి విపక్షాలన్నీ సమాయత్తమవుతున్నాయి. ఇప్పటికే పాట్నా, బెంగళూరులో సమావేశమైన విపక్షాలు మూడోసారి ముంబయిలో సమావేశం కానున్నారు. వచ్చే నెల 25, 26 తేదీల్లో ముంబయిలో ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశం పర్యవేక్షణ బాధ్యతలను శివసేన, శరద్ పవార్ వర్గాలకు అప్పగించాయి.
వచ్చే నెల 25, 26 తేదీల్లో…
బెంగళూరులో జరిగిన విపక్షాల సమావేశానికి 26 పార్టీలు హాజరైన సంగతి తెలిసిందే. కూటమికి “ఇండియా”గా నామకరణం చేశారు. ఇండియా వర్సెస్ ఎన్డీఏ మధ్య వచ్చే ఎన్నికల్లో పోరాటంగా నేతలు అభివర్ణించారు. ఈ సమావేశంలో పదకొండు మందితో కూడా సమన్వయ కమిటీని కూడా నియమించనున్నారు. కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ, ఆమ్ ఆద్మీ పార్టీ, జేడీయూ, ఆర్జేడీ, జేడీయూ, శివసేన, ఎన్సీపీ, ఝార్ఖండ్ ముక్తిమోర్చా, సమాజ్ వాదీ పార్టీ, సీపీఎం పార్టీల నుంచి పదకొండు మంది సభ్యులను ఎంపిక చేయనున్నారని తెలిిసింది. ఈ సమావేశంలో కన్వీనర్ ను కూడా ఎంపిక చేయనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. మోదీని ఎదుర్కొనేందుకు అవసరమైన వ్యూహాలను ఈ సమావేశంలో ఖరారు చేయనున్నారు.