రాష్ట్రంలో వరదలు, భారీ వర్షాలపై ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. ప్రాజెక్టుల పరిస్థితి, బాధితుల పునరావాస సహాయ కేంద్రాలపై ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. నాణ్యతమైన ఆహారాన్ని, నీటిని వరద బాధితులకు అందించాలని, పునరావాస కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు.
అన్ని వసతులూ…
బాధితుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు అందకూడదన్నారు. తిరిగి వారికి ఇళ్లకు వెళ్లే వరకూ అన్ని వసతులు కల్పించి వారు సొంత ఇంట్లో ఉండే ఫీలింగ్ ను కల్పించాల్సిందిగా ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుల వద్ద ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని సమీక్షించి వెంటనే తగిన నిర్ణయం తీసుకోవాలన్నారు.