మణిపూర్ లో జరుగుతున్న హింసాత్మక ఘటనలకు సంబంధించి వాస్తవ పరిస్థితులను తెలుసుకోవడానికి స్వయంగా విపక్షాలకు చెందిన పార్లమెంటు సభ్యులు నేడు మణిపూర్కు వెళ్లనున్నారు. అక్కడ పరిస్థితులను తెలుసుకోనున్నారు. ఇప్పటికే పార్లమెంటు ఉభయ సభలు మణిపూర్ అంశంపై అట్టుడికిపోతున్నాయి. గత కొద్ది రోజులుగా విపక్షాలు చర్చకు అనుమతించాలని కోరుతుంటే సభలు వాయిదా పడుతున్నాయి. దీంతో ప్రభుత్వంపై అవిశ్వాసానికి కూడా విపక్షాలు సిద్ధమయ్యాయి.
అధ్యయనం చేయడానికి….
ఈ నేపథ్యంలో మణిపూర్లో పరిస్థితులను తెలుసుకోవడానికి, అక్కడి పరిస్థితులను అధ్యయనం చేయడానికి కాంగ్రెస్, జేడీయూ, ఆర్జేడీ, ఎన్సీపీకి చెందిన ఎంపీలు మణిపూర్ వెళ్లనున్నారు. మొత్తం ఇరవై మంది వివిధ పార్టీలకు చెందిన ఎంపీలు మణిపూర్ వెళ్లనున్నారు. అక్కడ బాధితులతో చర్చించనున్నారు. ఈ సందర్భంగా మణిపూర్ వెళుతున్న విపక్ష ఎంపీలను మణిపూర్ లోకి అనుమతిస్తారా? లేదా? అన్నది కూడా చివరి నిమిషంలో తేలనుంది. పోలీసులు ఈ సందర్భంగా భారీ బందోబస్తును ఏర్పాటు చేయనున్నారు. మణిపూర్ లో శాంతి భద్రతలను ఈ బృందం సమీక్షించనుంది.