బీజేపీ అధ్యక్షురాలు పురంద్రీశ్వరిపై మంత్రి గుడివాడ అమర్నాధ్ మండిపడ్డారు. మాయలపకీరు వంటి మరిది చంద్రబాబు ట్రాప్ లో పడవద్దని ఆమెకు హితవు పలికారు. చంద్రబాబు ఉచ్చులో పడితే మీ భర్తలాగానే మీ రాజకీయ చరిత్ర కూడా ముగిసిపోతుందని గుడివాడ హెచ్చరించారు. దగ్గుబాటి వారు మరో పుస్తకం రాయాల్సిన పరిస్థితిని తెచ్చుకోవద్దని సెటైర్ వేశారు. మీరు బీజేపీ అధ్యక్షులా? లేక బాబుగారి జనతా పార్టీ అధ్యక్షులా అని అమర్ నాధ్ పురంద్రీశ్వరిని సూటిగా ప్రశ్నించారు.
మరిది గారి హయాంలో…
బీజేపీ అధ్యక్షురాలిగా చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నట్లుందన్నారు. బాబు హయాంలోనే చిత్తూరు మేయర్ ను ఛాంబర్ లో చంపేసిన విషయాన్ని మర్చిపోయారా? అని ప్రశ్నించారు. అప్పుడు అరాచకం అని ఎందుకు మాట్లాడలేదన్నారు. తండ్రిగారు పెట్టిన, మరిదిగారు నడుపుతన్న పార్టీ అంటే ఎందుకంత ప్రేమ అని నిలదీశారు. ఎందుకంత ఆరాటమన్నారు. టీడీపీ అధ్యక్ష పదవి చేపట్టి ఏ విమర్శలు చేసినా బాగుంటుందిగా అని ఛలోక్తి విసిరారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మద్యం నుంచి ఆదాయం రావడం లేదా? అని ప్రశ్నించిన గుడివాడ అమరనాధ్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణపై ఎందుకు స్పందించలేదని నలిలదీశారు.