భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్ ను నియమిస్తూ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉత్తర్వులు జారీ చేశారు. జాతీయ ఉపాధ్యక్షురాలిగా డీకే అరుణను, జాతీయ పార్టీ కార్యదర్శిగా సత్యకుమార్ ను నియమిస్తూ కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంది. ఇటీవల తెలంగాణ అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ ను తప్పించి ఆయన స్థానంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని నియమించిన సంగతి తెలిసిందే.
అసంతృప్తిని…
దీంతో బండి సంజయ్ కు పార్టీలో అత్యున్నత పదవి ఇవ్వాలని కేంద్ర నాయకత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని ఇచ్చింది. సత్యకుమార్ పేరు కూడా ఏపీ రాష్ట్ర బీజేపీ పదవి నియామకం చేపట్టడంలో వినిపించింది. కానీ అక్కడ పురంద్రీశ్వరిని నియమించడంతో సత్యకుమార్ కు మరోసారి జాతీయ కార్యదర్శి పదవిని కంటిన్యూ చేస్తూ కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో బండి సంజయ్ వర్గాన్ని సంతృప్తి పర్చేందుకు ముఖ్యమైన పదవిని అప్పగించింది.