కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్న మాటే కాని నేతల్లో మాత్రం సంతోషం కన్పించడం లేదు. ఉచిత హామీలకు ప్రాధాన్యత ఇవ్వడంతో నియోజకవర్గంలో పనులు సక్రమంగా జరగడం లేదు. దీంతో ఎమ్మెల్యేలు అసహనంతో ఉన్నారు. తాజాగా కాంగ్రెస్ కు చెందిన ఒక ఎమ్మెల్యే ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు రాసిన లేఖ సంచలనంగా మారింది. అయితే తనకు ఎమ్మెల్యేలు ప్రేమ లేఖలు రాస్తున్నారని, వీటిని పట్టించుకోవాలంటూ మంత్రులకు ముఖ్యమంత్రి తెలిపారు.
నియోజకవర్గాల్లో…
ఎమ్మెల్యేలుగా తాము ఏ పనులు చేయలేకపోతున్నామని, కనీసం మంత్రుల్లో ఒకరి పీఏలుగానో, పీఎస్ గానైనా నియమించండి అంటూ ఆయన సీఎంకు లేఖ రాశారు. ఇది పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. దీనిపై స్పందించిన సిద్ధరామయ్య ఎమ్మెల్యేలతో మంత్రులు భేటీ కావాలని, వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. దావణగెరె జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే ఈ లేఖ రాశారు. మంత్రులు నుంచి తమకు రెస్పాన్స్ లేదని, నియోజకవర్గాల్లో పనులు చేయలేకపోతున్నామని ఆయన లేఖలో తెలిపారు.