ఓం నమో వెంకటేశాయ..
శ్రీ వెంకటేశ్వర స్వామి వారి రూపాన్ని తలుచుకోగానే ముందుగా మనందరికీ గుర్తు వచ్చేది ఏడుకొండలు, మూడు నామాలు. ఈ మూడు నామాలు శ్రీవారి రూపుకే ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఈ మూడు నామాలను కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలువై ఉన్న తిరుమల కొండపై పెద్దగా అందరికీ కనిపించేలా ఏర్పాటు చేశారు. తిరుమల కొండకు నడిచి వెళ్లే మార్గంలో కూడా మూడు నామాల కొండ ఉంటుంది. పెద్దగా ఏర్పాటు చేసిన ఈ మూడు నామాలు దిగువనున్న తిరుపతికి కూడా కనిపిస్తుంది.
మూడు నామాల వెనక ఉన్న పరమార్ధం
సాక్షాత్తు ఆ శ్రీమహావిష్ణువు ధరించి మనుషులందరూ కూడా ధరించాలని చెప్పినవే ఈ మూడు నామాలు ఈ నామాలు అజ్ఞానాన్ని కర్మను ఖండిస్తాయని వివరిస్తాయి. ఈ మూడు నామాలను ఊర్ద్వా పుండ్రం అని పిలుస్తారు. సాధారణంగా మనం పసిపిల్లలు అంటే ఐదేళ్లు లోపు పిల్లల్లో మనం సత్వ గుణాన్ని చూస్తాము ఈ సద్గుణం మనిషిలో ఉంటే అది మనిషిని ఉన్నతమైన మార్గంలో ఉన్నతమైన లక్ష్యం వైపు నడిపిస్తుంది. ఈ మూడు నామాలని తిరునామం అని కూడా అంటారు.
తెల్ల నామాలు సత్వ గుణాన్ని, దాని వల్ల కలిగే ఉద్రేక రహిత స్థితిని తెలియజేస్తాయి అది పునాదిగా ఉండాలని కింద పాదపీఠం ఉంటుంది సత్వగుణం మనల్ని ఉన్నత స్థితికి తీసుకు వెళుతుందని సూచించేది నిలువు బొట్టు. హత్వగుణానికి అధిష్టాన దేవత శ్రీమహావిష్ణువు కనుక రెండు తెల్లని నిలువు బొట్లు అవే ఉర్ద్వా పుండ్రాలు.
ఇక విశ్వమంతా వ్యాపించిన అనురాగానికి ప్రతీక లేత ఎరుపు రంగు ఎరుపు రంగు లక్ష్మీ స్వరూపంగా మనమంతా భావిస్తాం. ఈ ఎరుపు రంగు లక్ష్మీ స్వరూపమే కాకుండా శుభసూచకం మరియు మంగళకరమైనది కాబట్టి తెలుగు నామాల మధ్యలో మెరుపు చూర్ణాన్ని ఉపయోగిస్తారు.
విశిష్టాద్వైత సిద్ధాంత ప్రవక్త సాక్షాత్తు ఆ ఆదిశేషుని హంసలో జన్మించిన శ్రీ రామానుజాచార్యులు స్వయంగా తన అందులతో శ్రీవారికి తిరుణామాలు అలంకరించి చెబుతూ ఉంటారు అలంకరించడం అనేది ఆనవాయితీగా మారింది.
కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆ శ్రీనివాసుడు కొలువైయున్న తిరుమల కొండపై కూడా ప్రతి శుక్రవారం అభిషేకం జరుగుతుంది. ఆ తరువాత 16 తులాల పచ్చ కర్పూరంతో ఒకటిన్నర తులం కస్తూరి తో ఈ తిరుణామాలు అలంకరిస్తారు. ఇవి మళ్లీ గురువారం వరకు తొలగించరు గురువారం స్వామివారి నేత్రాలు కనిపించేలా నామాన్ని కొంతవరకు మాత్రమే తగ్గిస్తారు దీనిని నేత్ర దర్శనం అని కూడా అంటారు. అంటే మిగతా రోజుల్లో నామం చాలా వెడల్పుగా స్వామి వారి కన్నులను కప్పేలా ఉంటాయి కానీ ఒక్క గురువారం మాత్రమే స్వామి వారి నేత్రాలు సగం కనిపించేలా భక్తులకు దర్శనం ఇస్తారు. ఇక శుక్రవారం ఉదయం అభిషేక సేవలో మాత్రమే స్వామి వారు మూడు నామాలు లేకుండా భక్తులకు దర్శనమిస్తారు. ఈ సమయంలో మాత్రమే నేత్ర దర్శనం, నిజపాద దర్శనం చేసుకునే అరుదైన అవకాశం భక్తులకు లభిస్తుంది. తిరిగి శుక్రవారం అభిషేకం తర్వాత మళ్లీ స్వామికి మూడు నామాలు అలంకరిస్తారు అంటే వారానికి ఒక్కసారి మాత్రమే శ్రీవారికి నామాలు దిద్దుతారు.
శ్రీవారి మూడు నామాల వెనుక మరో అర్థం కూడా ఉందని చెప్తున్నాయి పురాణాలు. వైష్ణవుల్లో అప్పట్లో రెండు తెగలు ఉండేవట ఒకటి వడగలై మరొకటి తెంగలై. వడగలై అనే తెగవారు వారి నుదుట నామాన్ని ఆంగ్ల అక్షరం “U” ఆకారంలో నామాన్ని దిద్దుకునే వారట. తెంగలై తెగకు చెందినవారు ఆంగ్ల అక్షరం “Y” ఆకారంలో తిరుణనామం దిద్దుకునే వారట .అయితే ఈ రెండు అక్షరాల ను కలిపి మద్యస్థంగా తమిళ అక్షరం “ప” అంటే “ப”ను పోలి ఉండేలా మరో నామం కూడా ఉందట.దీన్నే తిరుమణి కావుగా పిలుస్తారట అలా శ్రీవారికి మూడు నామాలు ప్రత్యేకమైనయని పురాణాలు చెబుతున్నాయి.
ఓం నమో వెంకటేశాయ