నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖలో పర్యటిస్తున్నారు. వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనతో పాటు కొన్ని ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. ఇన్ ఆర్బిట్ మాల్ తొలిదశ పనుల నిర్మాణానికి జగన్ శంకుస్థాపన చేయనున్నారు. రహేజా గ్రూప్ ఆరు వందల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. మొత్తం ఆరు లక్షల చదరపు అడుగులలో మాల్ ను నిర్మించనుంది. నాలుగు లక్షల చదరపు అడుగుల్లో పార్కింగ్ పూర్తి చేసేలా ప్లాన్ ను రూపొందించారు. ఇన్ ఆర్బిట్ మల్ ను 2026 కల్లా పూర్తి చేసేలా రహేజా గ్రూపు ప్రయత్నాలు ప్రారంభిస్తుంది.
వివిధ పనులకు…
అలాగే గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని యాభై పనులకు కూడా ముఖ్యమంత్రి జగన్ శంకుస్థాపన చేయనున్నారు. సిరిపురంలోని ఆంధ్రయూనివర్సిటీ క్యాంపస్ కు వెళ్లి అక్కడ ఎలిమెంట్ ఫార్మా ఇంక్యుబిలేషన్ సెంటర్, బయో మానటరింగ్ హబత్ తో సహా ఐదు ప్రాజెక్టులకు సంబంధించిన భవనాలను ప్రారంభించనున్నారు. తర్వాత బీచ్ రోడ్ లోని ఏయూ కన్వెన్షన్ సెంటర్ కు వచ్చి అక్కడ ఆంధ్రయూనివర్సిటీ విద్యార్థులతో జగన్ సమావేశం కానున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్త ిచేశారు. పోలీసులు భారీ బందోబస్తును నిర్వహిస్తున్నారు. తిరిగి సాయంత్రం విశాఖ నుంచి బయలుదేరి తాడేపల్లికి చేరుకోనున్నారు.