బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు మహారాష్ట్ర బయలుదేరి వెళ్లనున్నారు. ఉదయం పదిన్నర గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ఆయన ప్రత్యేక విమానంలో బయలుదేరి మరఠ్వాడకు చేరుకుంటారు. ఉదయం 11.15 గంటలకు కొల్హాపూర్ విమానాశ్రాయినికి చేరుకుని అక్కడి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించనున్నారు. కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారు అంటే ప్రసిద్ధి. ఆమెను దర్శించుకుని కేసీఆర్ ప్రత్యేక పూజలు చేయనున్నారు.
దళిత సాహిత్య వేత్త…
అనంతరం మధ్యాహ్నం 12.45 గంటలకు సాంగ్లి జిల్లాలోని వాటేగావ్ చేరుకుంటారు. అక్కడ దళిత నేత అన్నాభావు సాఠే 103వ జయంతి వేడుకల్లో పాల్గొంటారు. ఆయన విగ్రహానికి నివాళులర్పిస్తారు. అన్నాభఆవు సాఠే మహారాష్ట్ర దళిత సాహిత్య చరిత్రలో ఆద్యుడిగా గుర్తింపు పొందారు. అనంతరం అన్నాభావు సాఠే ఇంటికి వెళతారు. అనంతరం అక్కడ జరిగే బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించనున్నారు. అనంతరం ఇస్లాపూర్ లోని రఘునాధ్ దాదాపాటిల్ నివాసానికి చేరుకుంటారు.
బహిరంగ సభలో…
అక్కిడి నుంచి బయలుదేరి కొల్హాపూర్ లోని సాధు మహారాజ్ సమాధి వద్ద నివాళులు అర్పిస్తారు. నాగాల పార్క్ లోని పూధరి న్యూస్ పేపర్ యజమాని ఇంటికి వెళతారు. అక్కడి నుంచి సాయంత్రం 5.40 గంటలకు కొల్హాపూర్ విమానాశ్రయం నుంచి బయలుదేరి హైదరాబాద్ కు చేరుకుంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ పర్యటనలో పార్టీ విస్తరణ, చేరికలపై కేసీఆర్ దృష్టిపెట్టనున్నారు.