పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటించిన “బ్రో” చిత్రం ఇటీవల విడుదలయిన సంగతి తెలిసిందే. బ్రో చిత్రం మంచి టాక్ తెచ్చుకుంది. దీంతో చిత్ర బృందం విజయోత్సవాలను నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా విజయవాడ దుర్గమ్మను చిత్ర యూనిట్ దర్శించుకుంది. హీరో సాయి ధరమ్ తేజ్, దర్శకుడు సముద్రగని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయ మర్యాదలతో…
ఈ సందర్భంగా బ్రో చిత్ర యూనిట్ కు ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం వేదపండితుల చేత వేద ఆశీర్వచనాలు పలికారు. అమ్మవారి చిత్రపటాన్ని లడ్డూ ప్రసాదాన్ని వారికి అందించారు. ఈ సందర్భంగా బ్రో చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులందరికీ చిత్ర యూనిట్ కృతజ్ఞతలు తెలిపింది.