తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్య ఆరోగ్యశాఖకు చెందిన 466 వాహనాలను ప్రారంభించారు. నెక్లెస్ రోడ్డులో ఆయన ఈ వాహనాలను లాంఛనంగా ప్రారంభించారు. వైద్యసేవలను మరింత ప్రజలకు చేరవేయడంతో పాటు ఎమెర్జెస్సీ ఆరోగ్య సేవలను అందించేందుకు ఈ వాహనాలు ఉపయోగపడతాయని మంత్రి హరీశ్ రావు తెలిపారు. నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజావద్ద 204 అంబులెన్స్లు, 228 అమ్మఒడి వాహనాలను ముఖ్యమంత్రి కేసీఆర్ జెండా ఊపి ప్రారంభించారు.
ఆరోగ్య తెలంగాణగా…
అనంతరం ఆయన అక్కడ నుంచి బయలుదేరి మహారాష్ట్రకు వెళ్లిపోయారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు మెరుగైన సేవలను అందించేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నిస్తుందన్నారు. హైదరాబాద్ నలుమూలలా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణాలను చేపట్టి పేదల ఆరోగ్య రక్షణకు పాటుపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి మహమ్మద్ ఆలి, ఎమ్మెల్సీ వాణిదేవి, ఎమ్మెల్యే దానం నాగేందర్, ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు.