ప్రధాని నరేంద్ర మోదీ పూనేలో పర్యటిస్తున్నారు. ఆయన లోక్ మాన్య బాలగంగాధర్ తిలక్ జాతీయ అవార్డును అందుకున్నారు. ఈ పురస్కారాన్ని లోక్ మాన్య తిలక్ స్మారక్ మందిర్ ప్రదానం చేయనుంది. ప్రతిష్టాత్మకరమైన ఈ అవార్డును ప్రధాని నరేంద్ర మోదీ అందుకున్నారు. గతంలో అనేక మంది ప్రముఖులు ఈ అవార్డులు అందుకున్నారు.
అవార్డు అందుకుంటూ…
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ఈ అవార్డును అందుకోవడం సంతోషకరంగా ఉందని తెలిపారు. దేశం కోసం తిలక్ చేసిన త్యాగాలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. స్వరాజ్యం మన జన్మహక్కు అని తిలక్ నినదించిన విషయాన్ని ఆయన చెబుతూ దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథం వైపు నడపటమే ఈ ప్రభుత్వ ఉద్దేశ్యం.. లక్ష్యి లక్ష్యమని మోదీ అన్నారు.