విశాఖ పర్యటనలో ముఖ్యమంత్రి జగన్ పలు ప్రాజెక్టులకు భూమి పూజ చేశారు. పలు భవనాలను ప్రారంభోత్సవం నిర్వహించారు. విశాఖకు చేరుకున్న జగన్ తొలుత ఇనార్బిట్ మాల్ కు భూమి పూజలు చేసి అక్కడ నిర్వహించిన సభలో ప్రసంగించారు. ఆరు వందల కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఈ మాల్ వేలాది మందికి ఉపాధి కల్గుతుందన్నారు. విశాఖ అభివృద్ధికి ఇనార్బిట్ మాల్ నిర్మాణం ఎంతో దోహదపడుతుందన్నారు.
మరో ఆణిముత్యం…
విశాఖకు మరో ఆణిముత్యంలాగా నిలుస్తుందన్నారు. పదమూడు ఎకరాల విస్తీర్ణంలో ఇనార్బిట్ మాల్ నిర్మాణం వల్ల కొన్ని ప్రాంతాల్లోనే ఉంటుందన్నారు. రహేజా గ్రూపు ప్రతిష్టాత్మకంగా నిర్మించే ఈ మాల్ తో విశాఖ అభివృద్ధి వైపు దూసుకు వెళుతుందన్నారు. మరిన్ని పరిశ్రమలు విశాఖకు వస్తాయని జగన్ అన్నారు. ఇనార్బిట్ మాల్ ఏర్పాటుకు సహకరించిన నీల్ రహేజాకు, కంపెనీ సీఈవో రజనీష్ మహాజన్, శ్రావణ్ కుమార్ తో పాటు అందరికి తన కృతజ్ఞతలు అని ఆయన తెలిపారు. అనంతరం ఆంధ్రయూనివర్సిటీ క్యాంపస్ లో పలు భవనాలకు శంకుస్థాపనలు చేశారు.