బంగారం ధరలు అంతే. ఒకరోజు తగ్గితే ఆనందపడతాం. మరుసటి రోజు ధరలు పెరిగి బాధపెడతాయి. మగువలు అత్యంత మక్కువ చూపే బంగారం ధరలు రోజురోజుకూ పెరిగి పోతున్నాయి. పేదలకు, సామాన్యులకు, మధ్యతరగతి ప్రజలకు బంగారం కొనుగోలు చేయడం భారంగా మారనుంది. ఇక బంగారం కొందరి వస్తువే కానుందన్న కామెంట్స్ సర్వత్రా వినిపిస్తున్నాయి.
కొనుగోళ్లు పెరగడానికి…
బంగారం ఉంటే అదొక ధైర్యంగా భావించే మహిళలు.. ఇప్పుడు దానిని కొనుగోలు చేయాలంటే జంకుతున్నారు. ఎందుకంటే ధరలు పెరగడమే కారణమని చెబుతున్నారు. అయినా జ్యుయలరీ షాపులన్నీ ఈఎంఐల వెసులుబాటు కల్పించి కొనుగోళ్లను ప్రోత్సహిస్తున్నాయి. అందుకే బంగారం ధరలు పెరిగినా కొనుగోళ్లు తగ్గకుండా తమ వ్యాపారాలు సజావుగా జరిగేలా జాగ్రత్త పడుతున్నారు వ్యాపారులు.
వెండి కూడా…
తాజాగా ఈరోజు బంగారం ధరలు దేశ వ్యాప్తంగా పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరపై 150 రూపాయలు పెరిగింది. వెండి ధర కూడా పెరిగింది. కిలో వెండ ధరపై వెయ్యి రూపాయలు వరకూ పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 55,400 రూపాయలు పలుకుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 60,440 రూపాయలుగా కొనసాగుతుంది. ఇక కిలో వెండి ధర 81,000 రూపాయలకు చేరుకుంది.