బీఆర్ఎస్ నేత జూపల్లి కృష్ణారావు నేడు కాంగ్రెస్ లో చేరనున్నారు. ఆయనకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నారు. ఇప్పటికే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ లో చేరారు. ఖమ్మంలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన చేరిపోయారు. మహబూబ్ నగర్ జిల్లాలోనూ ప్రియాంక సమక్షంలో చేరాలనుకున్నా అనివార్య కారణాలతో వాయిదా పడటంతో ఆయననే ఢిల్లీకి పిలిపించారు.
ఖర్గే సమక్షంలో…
దీంతో జూపల్లి కృష్ణారావు మరికొందరి ముఖ్య నేతలతో కలసి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఏఐసీసీ భవన్ లో ఆయన పార్టీలో చేరనున్నట్లు పారటీ వర్గాలు వెల్లడించాయి. పార్లమెంటు సమావేశాలు జరుగుతుండటంతో ఆయననే ఢిల్లీకి పిలిపించారని నేతలు చెబుతున్నారు. చేరిక ఆలస్యం అవుతుండటంతో ముందుగా ఢిల్లీలో ఖర్గే సమక్షంలో పార్టీలో జూపల్లి చేరతారు. తర్వాత మహబూబ్ నగర్ లో భారీ బహిరంగ సభ పెట్టాలన్న యోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది.