తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు కడప జిల్లాలో పర్యటించనున్నారు. అనంతరం జమ్మలమడుగులో జరిగే రోడ్ షోలోనూ ప్రసంగిస్తారు. రాయలసీమలోని తాగునీటి ప్రాజెక్టులను పరిశీలించేందుకు చంద్రబాబు సీమ పర్యటన చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆయన జమ్మలమడుగుకు నిన్న రాత్రి చేరుకున్నారు.
పార్టీ నేతలు…
ఆయనకు తెలుగుదేశం పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. ఈరోజు గండికోట రిజర్వాయర్ ను చంద్రబాబు పరిశీలించనున్నారు. జమ్మలమడుగు చేరుకున్న చంద్రబాబుకు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు శివనాధ్ రెడ్డి, బీటెక్ రవితో పాటు పలువురు తెలుగుదేశం పార్టీ నేతలు భారీ ఎత్తున స్వాగతం పలికారు. చంద్రబాబు పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.