పార్లమెంటులో నేడు వాడి వేడి చర్చ జరగనుంది. ఢిల్లీ ఆర్డినెన్స్ విషయంలో నేడు చర్చ జరగనుంది. ఓటింగ్ జరగనుంది. విపక్ష కూటమికి లోక్ సభలో పెద్దగా బలం లేదు. బీఆర్ఎస్ కూడా విపక్ష కూటమి మద్దతు పలికింది. ఒడిశాకు చెందిన నవీన్ పట్నాయక్ పార్టీ బిజూ జనతాదళ్ మాత్రం బీజేపీకి మద్దతుగా నిలిచింది. దీంతో లోక్ సభలో బిల్లు సులువుగా బిల్లు ఆమోదం పొందనుంది.
పెత్తనం కోసమే…
అయితే రాజ్యసభ విషయంలోకి వచ్చేసరికి వైసీపీ, బీజేడీ మద్దతు తెలిపితే బిల్లు గట్టెక్కినట్లేనని బీజేపీ భావిస్తుంది. ఢిల్లీలో అధికారుల బదిలీల విషయంపై సుప్రీంకోర్టు కేంద్రానికి వ్యతిరేకంగా తీర్పు నివ్వడంతో ఆర్డినెన్స్ రూపంలో ఉభయసభల్లో బిల్లును ఆమోదింప చేసుకుని ముందుకు వెళ్లాలనుకుంటుంది. దీనివల్ల ఢిల్లీపై పెత్తనాన్ని వదులుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఇష్టపడటం లేదు. దీంతో ఆర్డినెన్స్ రూపంలో బిల్లును తెచ్చి ఆమోదింప చేసుకోవాలని నిర్ణయించింది.