తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ నేడు వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఆమె వరద బాధితులను పరామర్శించనున్నారు. నష్టపోయిన బాధితులతో నేరుగా మాట్లాడనున్నారు. రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో తమిళిసై సౌందర్ రాజన్ పాల్గొంటారని రాజ్ భవన్ వర్గాలు వెల్లడించాయి.
వరద బాధితులను…
వరద బాధితులను ఆదుకోవడంలో సర్కార్ విఫలమయిందన్న ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో తమిళిసై పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. వరద బాధితులకు రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ఆమె సాయానని అందించనున్నారు. ఇప్పటికే వరద బాధితులకు అండగా నిలవడంలో ప్రభుత్వం విఫలమయిందంటూ విపక్ష కాంగ్రెస్ నిన్న గవర్నర్ ను కలిసిన సంగతి తెలిసిందే.