రాష్ట్రపతి ద్రౌపది ముర్మును నేడు విపక్ష పార్లమెంటు సభ్యులు కలవనున్నారు. ఆమె వారికి అపాయింట్మెంట్ ఇచ్చారు. మణిపూర్ అంశాన్ని రాష్ట్రపతికి నివేదిక రూపంలో ఇచ్చేందుకు విపక్ష పార్టీలకు చెందిన పార్లమెంటు సభ్యులు కలవనున్నారు. ఆమెను కలసి మణిపూర్ లో నెలకొన్న పరిస్థితులను వివరించనున్నారు.
శాంతిభద్రతలు…
విపక్ష పార్టీలకు చెందిన పార్లమెంటు సభ్యులు ఇరవై మంది ఇటీవల మణిపూర్ లో పర్యటించి అక్కడ పరిస్థితులను అధ్యయనం చేసి వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై నివేదికను రాష్ట్రపతికి ఇవ్వనున్నారు. మణిపూర్ లో శాంతిభద్రతలు పూర్తిగా అదుపుతప్పాయని వీరు ఫిర్యాదు చేయనున్నారు. అక్కడ ప్రశాంత వాతావరణం నెలకొనేలా చూడాలని కోరనున్నారు.