అధికార వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కేవలం స్పీచ్ లలోనే కాదు ట్వీట్లతోనూ సెటైర్లు వేస్తుంటారు. ఆయన చేసే ట్వీట్లు అధికార పార్టీకి ఇబ్బందికరంగా మారుతున్నాయి. పార్లమెంటులో కేంద్ర గనుల మంత్రి ప్రహ్లాద్ జోషి ఆంధ్రప్రదేశ్ లో 47.17 టన్నుల బంగారం వనరులు ఉన్నట్లు ప్రకటించిన నేపథ్యంలో పవన్ కల్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై చేసిన ట్వీట్ వైరల్ అయింది.
బంగారం గనులు…
వైఎస్సార్సీపీ అడ్వెంచరీస్ ప్రెజెంట్స్.. “జగన్నాస్ గోల్డ్” అంటూ కాప్షన్ తో ఒక ట్వీట్ చేశారు. నౌ ఓన్లీ టాస్క్ సెర్చింగ్ ఫర్ గోల్డ్ అంటూ పవన్ ట్వీట్ చేశారు. ఇది వైరల్ గా మారింది. ప్రభుత్వం బంగారం గనుల దోపిడీకి సిద్ధమయిందంటూ పవన్ కల్యాణ్ చేసిన ట్వీట్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. దీనికి అధికార పార్టీ నుంచి ఎలాంటి కౌంటర్ వస్తుందో చూడాలి మరి.