విశాఖలో నిన్న అర్ధరాత్రి ఒక కారు బీభత్సం సృష్టించింది. మితిమీరిన వేగంతో వచ్చి కారు చెట్టెక్కేసింది. మద్యం తాగి కారు నడిపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కారు బీభత్సంతో దాదాపు ఏడు ద్విచక్రవాహనాలు ధ్వంసమయ్యాయి. విశాఖలోని రామాటాకీస్ నుంచి సిరిపురం వైు వెళుతున్న కారు వీఐపీ రోడ్డులోని ప్యారడైజ్ హోటల్ సమీపంలో ఉన్న చెట్టును ఢీకొట్టింది.
మహిళగా గుర్తింపు…
ప్రమాదం జరిగిన సమయంలో కారు వేగం 120 కిలోమీటర్ల వరకూ ఉంటుందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మద్యం మత్తులో కారు డ్రైవ్ చేయడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. కారు నడిపింది ఒక మహిళగా పోలీసులు గుర్తించారు. అక్కడే ఒక బార్ కూడా ఉండటం విశేషం. ప్రమాదం జరిగిన వెంటనే ఆమె మరో కారులో వెళ్లిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఆమె నగరంలో వైద్యురాలు అని చెబుతున్నారు. సీసీ టీవీ ఫుటేజీ, కారు నెంబరు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.