హైదరాబాద్ నుంచి బెంగళూరుకు, బెంగళూరు నుంచి హైదరాబాద్ కు నిత్యం ట్రాఫిక్ ఉంటుంది. ముఖ్యంగా ఐటీ కంపెనీలు ఇక్కడే ఉండటంతో వీకెండ్ లో ఎక్కువ మంది ఈ రెండు నగరాల మధ్య రాకపోకలు సాగిస్తుంటారు. దీనిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వందేభారత్ రైలును ప్రారంభించేందుకు రెడీ అయింది. ముహూర్తం కూడా నిర్ణయించింది. ఈ నెల 6వ తేదీ కాని, 15వ తేదీ కానీ ఈ రైలు సేవలు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
బెంగళూరుకు…
దక్షిణ మధ్య రైల్వేకు కేంద్ర ప్రభుత్వం మూడో వందేభారత్ రైలును మంజూరు చేసినట్లయింది. ఇప్పటికే సికింద్రాబాద్ నుంచి తిరుపతికి, సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నానికి వందేభారత్ రైలు పరుగులు తీస్తున్న సంగతి తెలసిందే. ఈ రైళ్లకు మంచి డిమాండ్ ఉంది. ఐటీ ఉద్యోగులు రెండు నగరాల మధ్య రాకపోకలను సాగించడానికి బెంగళూరు రైలు ఉపయోగపడుతుందని రైల్వే శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే ఈ రైలును ఎవరు జెండా ఊపి ప్రారంభిస్తారన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ప్రయాణ సమయం తగ్గుతుందని ప్రయాణికులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.