సినీనటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ నేడు భారతీయ జనతా పార్టీలో చేరనున్నారు. ఆమె ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. సాయంత్రం బీజేపీ కేంద్ర నాయకత్వం సమక్షంలో ఆమె కాషాయ కండువా కప్పుకోనున్నారు. జయసుధ రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిచయమున్న నేత. సినీనటిగా మాత్రమే కాకుండా గతంలో కాంగ్రెస్ నుంచి సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా కూడా విజయం సాధించారు.
కిషన్ రెడ్డిని కలిసి…
ఇటీవల బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిని కలిసిన జయసుధ పార్టీలో చేరేందుకు అంగీకరించారు. గత కొంత కాలంగా రాజకీయంగా సైలెంట్ గా ఉన్న జయసుధ తిరిగి పాలిటిక్స్ లో యాక్టివ్ కావాలని నిర్ణయించుకున్నారు. ఆమెకు ముషీరాబాద్ టిక్కెట్ ను కేటాయించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. జయసుధ చేరికతో పార్టీ హైదరాబాద్ నగరంలో మరింత బలోపేతం అవుతుందని నేతలు చెబుతున్నారు.