మణిపూర్లో జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా రేపు మన్యం జిల్లాలో గిరిజనులు బంద్ కు పిలుపు నిచ్చారు. మణిపూర్ లో ఒక వర్గం వారిపై దాడులు చేస్తున్నారని, పోలీసులు చోద్యం చూస్తున్నారన్న ఆరోపణలున్నాయి. సుప్రీంకోర్టు కూడా మణిపూర్ లో జరుగుతున్న ఘటనలపై తీవ్రంగానే స్పందించింది. అయినా కేంద్ర ప్రభుత్వం నిందితులను ఇప్పటి వరకూ అరెస్ట్ చేయకపోవడమేంటని గిరిజన సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.
మణిపూర్ లో…
దీంతో మణిపూర్ గిరిజనులకు మద్దతుగా ఏపీలోని మన్యం జిల్లాలో రేపు బంద్ పాటించాలని గిరిజనులు నిర్ణయించారు. ఆదివాసీలపై జరుగుతున్న దాడులను పోలీసులు సకాలంలో నిలువరించలేకపోయిందని కూడా గిరిజనులు ఆరోపిస్తున్నారు. దీంతో మన్యం జిల్లాలోని గిరిజన సంఘాలు బంద్ కు పిలుపునిచ్చాయి. దీంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గిరిజనసంఘాల నేతలను ముందస్తు అరెస్ట్లు చేసే అవకాశాలున్నాయి.