త్వరలోనే డబుల్ బెడ్ రూం ఇళ్ల లబ్దిదారులకు ఇళ్లను కేటాయిస్తామని మున్సిపల్ శాఖ మంత్రి కె. తారకరామారావు తెలిపారు. హస్తినాపురంలో జరిగిన ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ 18 వేల కుటుంబాలకు కొన్నేళ్లుగా ఉన్న సమస్యను తొలగించిన ఘనత కేసీఆర్ కే దక్కిందన్నారు. ఎల్.బి.నగర్ లో అత్యధికంగా డబుల్ బెడ్ రూం ఇళ్లను మంజూరు చేశామన్నారు. తలసరి ఆదాయంలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని కేటీఆర్ అన్నారు. ఎల్.బి.నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఘటికుడని, తన నియోజకవర్గ సమస్యలను పరిష్కరించుకోవడంలో ముందుంటారని తెలిపారు.
మెట్రోరైలు…
గృహలక్షి పథకం కూడా తెలంగాణలో ప్రారంభమైందని, పేదలు ఇళ్లు కట్టుకోవడానికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుందన్నారు. హైదరాబాద్ లో అదనంగా 314 కిలోమీటర్ల మెట్రో రైలును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎల్.బి.నగర్ నుంచి హయత్ నగర్ వరకూ మెట్రో రైలును విస్తరిస్తామని, దీనికి సంబంధించి ఇటీవల మంత్రివర్గం కూడా ఆమోదం తెలిపిందని కేటీఆర్ తెలిపారు. ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ వెళుతున్నామని, ప్రజలకు అండగా నిలిచేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని కేటీఆర్ అన్నారు.