నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేవనెత్తిన ప్రశ్నలకు ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు సమాధానం చెప్పాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. ఆయన బుధవారం జమ్మలమడుగులో మీడియాలో మాట్లాడారు. నాడు టీడీపీ హయాంలో చీనిచెట్లను బతికించాలని, కుప్పం కన్నా ముందు పులివెందులకు నీళ్లు తీసుకెళ్లాలని చుట్టు పక్కల గ్రామాలకు మూడువేల కోట్లు ఖర్చు పెట్టి యుద్ధప్రాతిపదికన అవుకు టన్నల్ పనులు చంద్రబాబు పూర్తి చేయించారన్నారు. మైలవరం రిజర్వాయర్ లో నీళ్లు పెట్టామపి. 74వేల క్యూసెక్కులు వచ్చే పోతిరెడ్డిపాడు నుండి బనకచర్ల వరకు క్లీయర్ చేశామని తెలిపారు.
నోరు మెదపరా…
గండికోట రైతులకు వారు నవ్వుతూ ఉండాలని, నీళ్లు నిలబెడాతని హామీ ఇచ్చి ఆరు లక్షల డెభ్బైఐదు వేలు ఇచ్చారని 16 టీఎంసీలు నీళ్లు నిలబెట్టామని తెలపిారు. దీనికి సమాధానం చెప్పాలని దేవినేని ఉమ డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం ఒక్క ఎకరానికైనా నీళ్లిచ్చిందా ? అని ప్రశ్నించారు. రైతును కొట్టి లాఠీ ఛార్జీ చేయించి ఖాళీ చేయించారని, డబ్బులు ఇవ్వకపోగా, రైతులతో కన్నీళ్లు పెట్టించారు వాళ్ళకు న్యాయం చేసారా ? అంటూ దేవినేని నిలదీశారు. గండికోటలో ఒక ఎకరానికైనా నీళ్లు ఇవ్వగలిగారా ? ఆర్బీసీ లెఫ్ట్ ప్రాజెక్టు క్లియర్ చేసావా జగన్ రెడ్డీ ?అంటూ ఉమ ఫైర్ అయ్యారు.