బంగారం ధరలు పెరగడంతో ఇటీవల కాలంలో డిమాండ్ తగ్గింది. కొనుగోళ్లు కూడా భారీగా పడిపోయాయి. బంగారం కొందరికే వరంగా మారింది. ఎక్కువ మందికి భారంగా మారడంతో కొనుగోళ్లు మందగించాయి. పెళ్లిళ్ల సీజన్ దగ్గరపడుతుండటంతో బంగారం ధరలు పెరుగుతాయన్న ఆందోళన అందరిలోనూ వ్యక్తమవుతుంది. అందుకే ముందుగా కొనుగోలు చేసి పెట్టుకునే వారు కొందరుంటారు. కానీ నేడు అలాంటి వారు కన్పించడం లేదన్నది వ్యాపారవర్గాల నుంచి వినిపిస్తున్న మాట.
కొనుగోళ్లు తగ్గడంతో….
అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, రష్యా – ఉక్రెయిన్ యుద్ధం, భారత ప్రభుత్వం దిగుమతులను తగ్గించడం వంటి కారణాలతో బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కేవలం పెట్టుబడి కోసం చూసే వారు మినహా బంగారం కొనుగోళ్లు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదని, ఇది తమ వ్యాపారాలను దెబ్బతీస్తుందని మరో వైపు జ్యుయలరీ దుకాణాల యాజమాన్యం ఆందోళన వ్యక్తం చేస్తుంది.
ధరలు ఇలా…
గత కొద్ది రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలు ఇప్పుడు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. దేశంలో ఈరోజు బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధర కూడా అంతే స్థాయిలో తగ్గింది. 22 గ్రాముల పది గ్రాముల బంగారం ధరపై మూడు వందల రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై ఏడు వందల రూపాయలు తగ్గింది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ప్రస్తుతం మార్కెట్ లో 55,100 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 60,110 రూపాయలుగా కొనసాగుతుంది. ఇక కిలో వెండి ధర ప్రస్తుతం మార్కెట్ లో 77.300 రూపాయలుగా ఉంది.