ప్రధాని నరేంద్ర మోదీతో భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ నేడు సమావేశం కానున్నారు. బండి సంజయ్ తన కుటుంబ సభ్యులతో కలసి ప్రధాని మోదీని కలవనున్నారు. ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీతో భేటీకి అపాయింట్మెంట్ దొరికింది. దీంతో బండి సంజయ్ తన కుటుంబ సభ్యులతో కలసి ప్రధానిని కలసి కాసేపు చర్చించనున్నారు.
అధ్యక్ష పదవి నుంచి….
బండి సంజయ్ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించిన తర్వాత ఇప్పటికే అమిత్ షాను కలిశారు. అనంతరం ప్రధాని మోదీని కూడా కలవనున్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అనుసరించాల్సి వ్యూహాలపై ఈ సందర్భంగా చర్చించే అవకాశాలున్నాయి. పార్టీలో జరుగుతున్న పరిణామాలను కూడా చర్చించే అవకాశముందని చెబుతున్నారు.