తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదాయత్ర ప్రస్తుతం వినుకొండ నియోజకవర్గంలో కొనసాగుతుంది. ఇప్పటి వరకూ లోకేష్ 2299 కిలోమీటర్ల దూరం నడిచారు. యువగళం పాదయాత్ర నేటికి 174వ రోజుకు చేరుకుంది. ఉదయం ఎనిమిది గంటలకు నగరాయపాలెం నుంచి పాదయాత్ర ప్రారంభమయింది. ఉదయం 9 గంటలకు కొండ్రముట్లలో 2,300 కిలోమీటర్లకు చేరుకోవడంతో అక్కడ నారా లోకేష్ శిలాఫలాకాన్ని ఆవిష్కరించారు.
వినుకొండ నియోజకవర్గంలో…
అనంతరం లోకేష్ సత్యనారాయణపురంలో స్థానికులతో సమావేశమై వారి సంస్యలపై చర్చిస్తారు. వారికి హామీలు ఇవ్వనున్నారు. ఉదయం పదకొండు గంటలకు కొచ్చెర్లలో స్థానికులతో కూడా సమావేశమై చర్చలు జరుపుతారు. మధ్యాహ్నం ఒంటి గంటకు అంగలూరులో స్థానికుతో లోకేష్ సమావేశం కానున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు వనికుంటలో స్థానికులతో భేటీ అయి సమస్యలపై చర్చలు జరుపుతారు. మధ్యాహ్నం రెండు గంటల పదిహేను నిమిషాలకు వనికుంట శివారు కేంద్రంలో భోజన విరామానికి ఆగుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.