వారణాసిలో ఉన్న జ్ఞనవాపి మసీదులో సర్వే నిర్వహించడానికి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాకు అలహాబాద్ హైకోర్టు అనుమతించింది. దీంతో పురావస్తు శాఖ జ్ఞనవాపి మసీదులో సర్వే నిర్వహించింది. వారణాసి జిల్లా కోర్టు ఆదేశాలపై కొందరు అలహాబాద్ కోర్టును ఆశ్రయించారు. మసీదులో సర్వే నిర్వహించేందుకు సర్వే ఆఫ్ ఇండియాకు అనుమతిచ్చింది.
మసీదులో…
సెషన్స్ కోర్టు తీర్పును హైకోర్టు కూడా సమర్ధించింది. జ్ఞనవాపి మసీదులో హిందూ ఆలయానికి సంబంధించిన ఆనవాళ్లున్నాయని కొన్ని సంస్థలు ఆరోపిస్తున్నాయి. అక్కడ గతంలో శివాలయం ఉండేదని, దానిని కూలదోసి మసీదును నిర్మించారని హిందూ సంస్థలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో జ్ఞనవాపి మసీదులో సర్వే నిర్వహించాలన్న నిర్ణయంతో వాస్తవాలు వెలుగు చూస్తాయని ఉత్తర్ ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య అభిప్రాయపడ్డారు. అలహాబాద్ హైకోర్టు తీర్పును ఆయన స్వాగతించారు.