పులివెందులలో పర్యటించి ముఖ్యమంత్రి జగన్ పై విమర్శలు చేసిన చంద్రబాబుకు కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి ఘాటు కౌంటర్ ఇచ్చారు. పులివెందులకు వచ్చి చంద్రబాబు జ్ఞానం లేకుండా మాట్లాడారని ఫైర్ అయ్యారు. బాబు నోటి నుంచి వచ్చేవి పచ్చి అబద్ధాలేనంటూ ఆయన మండిపడ్డారు. చంద్రబాబు లాగా ముఖ్యమంత్రి జగన్ ఆలోచించరన్నారు. అలా ఆలోచించి ఉంటే కుప్పంను రెవెన్యూ డివిజన్ గా చేసి ఉండేవారా? అని అవినాష్ రెడ్డి ప్రశ్నించారు.
కుప్పంతో పాటు…
చంద్రబాబు సొంత నియోజకవర్గాన్ని కూడా జగన్ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నాడని అవినాష్ రెడ్డి అన్నారు. తాను సింహాన్ని అని చెప్పుకుంటూ చంద్రబాబు తిరుగుతున్నాడని, తాను సింహాన్ని అని చంద్రబాబు చెప్పుకుంటే సరిపోదని, ప్రజలు అనాలని అవినాష్ రెడ్ి ఎద్దేవా చేశారు. అడవి సింహమో? గ్రామ సింహమనేది ప్రజలు తేలుస్తారని అని అన్నారు. పక్క జిల్లాలకు వెళ్లి పులివెందుల రౌడీలు, కడప గుండాలు అని మాట్లాడే చంద్రబాబు ఈ ప్రాంతంలో ఎందుకు పర్యటించాల్సి వచ్చిందో చెప్పాలన్నారు. కడప ప్రాంతమంటే ఎందుకంత ధ్వేషమని చంద్రబాబును అవినాష్ రెడ్డి ప్రశ్నించారు.