తొలిరోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. శాసనసభలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వద్దకు వెళ్లి మంత్రి కేటీఆర్ హత్తుకున్నారు. ఇద్దరు ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. ఇద్దరూ కలసి పది నిమిషాల పాటు సంభాషించుకున్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈటలను కేటీఆర్ కలవడం ఇది మొదటి సారి కాదు.
గతంలోనూ…
గతంలో కూడా ఈటలను కలసి ఆయనతో చర్చలు జరిపారు. అయితే ఇద్దరి మధ్య ఏ సంభాషణ జరిగిందన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ కు గురయిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఈటల రాజేందర్ వైపు చూడటానికే అయిష్టత ప్రదర్శిస్తుంటే.. ఆయన కుమారుడు కేటీఆర్ మాత్రం కౌగిలింతలతో దగ్గరకు తీసుకోవడం ఏం రాజకీయం అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. మరి ఇద్దరి మధ్య ఏం జరిగిందన్నది వారిలో ఒకరు చెప్పాల్సిందే.