వచ్చే సోమ, మంగళవారంలో ముఖ్యమంత్రి జగన్ వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఆయన ఏ జిల్లాలో పర్యటించేది ఆదివారం ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ అధికారులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో స్పష్టత ఇచ్చారు. వరద బాధిత ప్రాంతాల్లో సహాయ, పునరావాస కార్యక్రమాలపై కలెక్టర్లకు మరోసారి ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ వరద బాధిత ప్రాంతాల్లో సమర్థవంతంగా సహాయ పునరావాసం కార్యక్రమాలు జరగాలన్నారు. ఎక్కడా కూడా విమర్శలకు తావులేకుండా చూడాలని, అధికారులకు అవసరమైన నిధులు, వనరులు సమకూర్చి వారికి సమర్థవంతంగా సహాయ, పునరావాస కార్యక్రమాలు జరిగేలా చేస్తున్నామని తెలిపారు.
సహాయక చర్యలు…
విపత్తు సంకేతాలు రాగానే కలెక్టర్లకు ముందస్తుగా నిధులు విడుదల చేస్తున్నామని, మీరు అడిగిన టిఆర్ –27 కింద నిధులు సహా, అవసరమైన వనరులను సమకూరుస్తూ అధికారులను ఎంపవర్ చేస్తున్నామని సహాయ, పునరావాస చర్యలు సమర్థవంతంగా చేపట్టేలా అన్నిరకాలుగా ఈ ప్రభుత్వం నాలుగేళ్లకాలంగా తోడుగా నిలుస్తోందన్నారు. – తర్వాత బాధితులకు సరైన విధంగా సహాయం అందించేలా తగినన్ని చర్యలు తీసుకోవడానికి సరిపడా సమయం ఇస్తున్నామని తెలిపారు. వరద సహాయ కార్యక్రమాల్లో ఉదారంగా వ్యవహరించాలని, మానవీయతతో, సానుభూతితో ఉండాలని జగన్ కోరారు. ఇంట్లోకి వరదనీరు వస్తే కచ్చితంగా ఇంటికి రూ.2వేలు రూపాయలు ఇవ్వాలని, 25 కేజీలబియ్యం, పాలు, కేజీ కూరగాయలు, కేజీ వంటనూనె, 1 కేజీ పప్పు లాంటి సరుకులు తప్పనిసరిగా అందించాలని జగన్ అధికారులను ఆదేశించారు.