ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. ఢిల్లీ ఆర్డినెన్స్ పై లోక్సభలో చర్చ జరిగింది. విపక్ష సభ్యులు ఈ ఆర్డినెన్స్ పై మాట్లాడాయి. విపక్షాలు మాట్లాడిన అనంతరం ఈ అంశంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడారు. అనంతరం బిల్లు ఆమోదం పొందినట్లు స్పీకర్ తెలిపారు. విపక్షాల నిరసనల మధ్యనే బిల్లుకు అధికార పక్షం ఆమోదం తెలిపింది.
నిరసనల మధ్యనే….
ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అధికారాలను దొడ్డిదారిన చేజిక్కించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఇలాంటి ఆర్డినెన్స్ ను తెస్తుందని విపక్షాలు ధ్వజమెత్తాయి. ఇది చీకటి రోజుగా విపక్షాలు అభివర్ణించాయి. ప్రజల మద్దతుతో గెలిచిన ప్రభుత్వ అధికారాలను మందబలంతో తమ చేతికి చేజిక్కించుకునే ప్రక్రియలో భాగంగానే ఢిల్లీ ఆర్డినెన్స్ తెచ్చారంటూ విపకస పార్టీలు మండి పడుతున్నాయి. కానీ అధికార పక్షం దేశ రాజధానికి సంబంధించిన భద్రత కేంద్రం చేతిలోనే ఉండటం సురక్షితమని వాదిస్తుంది. మొత్తం మీద లోక్ సభలో ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు ఆమోదం పొందింది. ఇక రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదం పొందాల్సి ఉంది.