ఉత్తరాఖండ్లో ఇంకా భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. భారీ వర్షాలకు కొండచరియలకు విరిగిపడుతున్నాయి. కొండచరియలు విరిగిపడి పదమూడు మంది గల్లంతైన ఘటన ఉత్తరాఖండ్లో జరిగింది. ఉత్తరాఖండ్ లోని కేదార్నాథ్ ధామ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. అధికారులు శిధిలాలను తొలగించి గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
శిధిలాలను తొలగించి…
కొండచరియలు విరిగి పడి కింద ఉన్న కొన్ని దుకాణాలపై పడటంతో ఈ దుర్ఘటన జరిగింది. నిన్న రాత్రి జరిగిన ఈ ఘటనలో పదమూడు గల్లంతయినట్లు స్థానికులు చెబుతున్నారు. వారి ఆచూకీ కోసం అధికారులు వెదుకులాడుతున్నారు. శిధిలాల తొలగింపు కార్యక్రమం చేపట్టారు. పదమూడు మంది బతికే ఛాన్స్ లేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ విషాద ఘటనతో అక్కడ ఉన్న దుకాణాలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు.