కేసీఆర్ ప్రభుత్వంపై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. తెలంగాణ ప్రజలకు చెందిన భూములను తెగనమ్ముతున్నారని ఆయన ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో భూముల అమ్మకాన్ని వ్యతిరేకించిన కేసీఆర్ ఇప్పుడు అధికారంలోకి రాగానే భూములను అమ్మడం ఏంటని ఆయన ప్రశ్నించారు. భూముల అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయంతో వచ్చే ఎన్నికల్లో గెలవాలని కేసీఆర్ తాపత్రయపడుతున్నారని మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు.
వచ్చే ఎన్నికల్లో…
ఒక పద్ధతి లేకుండా పాలన చేస్తే ఇలానే ఉంటుందని మల్లు భట్టి విక్రమార్క అన్నారు. భవిష్యత్ తరాలకు గజం భూమి లేకుండా చేసే కుట్రకు కేటీఆర్ తెరలేపారన్నారు. వచ్చే అసెంబ్లీకి పదిహేను మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కంటే ఎక్కువ రారన్న విషయాన్ని కేసీఆర్ మరచిపోతున్నారని, అందుకే భూములను తెగనమ్ముతున్నారని మల్లు ఫైర్ అయ్యారు. ప్రజలకు చెందిన భూములను ఈ ప్రభుత్వం అమ్మడాన్ని అందరూ వ్యతిరేకించాలని, అవసరమైతే పోరాటం చేద్దామని మల్లు పిలుపునిచ్చారు.