మజ్లిస్ అధినేత, హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్, ముంబయి, చెన్నై, బెంగళూరు నగరాలు కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారనున్నాయని ఆయన అన్నారు. అది ఎంతో దూరం లేదని ఒవైసీ అభిప్రాయపడ్డారు. ఢిల్లీ ఆర్డినెన్స్ పై చర్చ జరిగిన సందర్భంలో అసుదుద్దీన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
కేంద్రం నిర్ణయాన్ని…
అందుకే ప్రాంతీయ పార్టీలన్నీ ఇప్పుడే మేలుకోవాలని, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించాలని అసదుద్దీన్ ఒవైసీ కోరారు. ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్న అసద్ ఈ బిల్లు ప్రవేశపెట్టి సభ గౌరవాన్ని ఈ ప్రభుత్వం కించపరుస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను ఇప్పుడు వ్యతిరేకించకుంటే భవిష్యత్లో ముఖ్యమైన నగరాలన్నీ కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారతాయని తెలిపారు.