కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. సూరత్ కోర్టుతోపాటు, అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మోదీ పేరుతో దూషించిన కేసులో సూరత్ కోర్టు రాహుల్ కు రెండేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. రెండేళ్లు జైలు శిక్ష విధించడంతో ప్రజాప్రాతినిధ్యం చట్టం ప్రకారం రాహుల్పై లోక్సభ సెక్రటేరియట్ రాహుల్ పార్లమెంటు సభ్యత్వంపై అనర్హత వేటు వేసింది. దీంతో రాహుల్ ఎంపీ పదవికి దూరమయ్యారు.
రాజకీయ కారణాలతో….
ఆయన పార్లమెంటు సమావేశాలకు కూడా హాజరు కావడం లేదు. మార్చి 23న రాహుల్ గాంధీకి రెండేళ్లు జైలు శిక్ష విధించింది. పరువు నష్టం కేసులో రెండేళ్లు జైలు శిక్ష వేయడంతో పదవి కోల్పోయిన రాహుల్ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పునే సమర్థించడంతో రాహుల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో విచారణ అనంతరం సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. అంత శిక్ష వేయాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అందుకే సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. దీంతో రాహుల్ గాంధీ పార్లమెంటులో తిరిగి కాలుమోపేందుకు అవకాశం కలిగింది.