పుంగనూరులో తెలుగుదేశం పార్టీ జరిపిన దాడులకు నిరవసనగా ఈరోజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు జిల్లా బంద్కు పిలుపు నిచ్చింది. చంద్రబాబు రెచ్చగొట్టి టీడీపీ శ్రేణులను పోలీసుల పైకి ఉసికొల్పారని, వైసీపీ శ్రేణులపై రాళ్లురువ్వారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పోలీసు వాహనాలను దహనం చేసిన కేసుల్లో చంద్రబాబును మొదటి ముద్దాయిగా పెట్టాలని డిమాండ్ చేస్తూ వైసీపీ నేతలు నేడు చిత్తూరు జిల్లా బంద్ ను పాటిస్తున్నారు.
దాడులకు నిరసనగా…
నిన్న పుంగనూరు, అంగళ్లులో వైసీపీ, టీడీపీ నేతల మధ్య రాళ్ల దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో అనేక మంది పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసు వాహనాలు కూడా దగ్దమయ్యాయి. చంద్రబాబు శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలనే చంద్రబాబు టీడీపీ నేతలను రెచ్చగొట్టారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దాడులకు పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ వారిపై కేసులు నమోదు చేయాలని కోరుతూ ఈరోజు చిత్తూరు జిల్లా బంద్ కు వైసీపీ పిలుపునిచ్చింది.