జైపూర్ ఎక్స్ప్రెస్ రైలులో జరిగిన కాల్పుల్లో మరణించిన సైఫుద్దీన్ కుటుంబాన్ని ఆదుకుంటామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇటీవల జైపూర్ ఎక్స్ప్రెస్ రైలులో ఒక కానిస్టేబుల్ ఎస్ఐపై జరిపిన కాల్పుల్లో అదే బోగీలో ఉన్న హైదరాబాద్ కు చెందిన సైఫుద్దీన్ మరణించిన సంగతి తెలిసిందే. సైఫుద్దీన్కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ విషయంపై ఎంఐఎం నేతలు కూడా ఆందోళన చెందారు. పోలీసు కానిస్టేబుల్ జరిపిన కాల్పుల్లో చనిపోయిన సైఫుద్దీన్ కుటుంబాన్ని ఆదుకోవాలని నేతలు డిమాండ్ చేశారు.
డబుల్ బెడ్ రూం ఇల్లు…
దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్ సైఫుద్దీన్ కుటుంబానికి భరోసా ఇస్తూ హామీ ఇచ్చారు. సైఫుద్దీన్ భార్యకు ఉద్యోగం ఇస్తామని చెప్పారు. అంతేకాదు ఆ కుటుంబానికి డబుల్ బెడ్ రూం ఇళ్లను కేటాయించనున్నట్లు ప్రకటించారు. సైఫుద్దీన్ కుమార్తెలు ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని అందచేస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు.