అనర్హత పిటీషన్ పై సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన తర్వాత రాహుల్ గాంధీ స్పందించారు. ఈరోజు కాకుంటే రేపు నిజం బయటకు వస్తుందని రాహుల్ అన్నారు. తీర్పు ఆలస్యమయినప్పటికీ అంతిమంా న్యాయం గెలుస్తుందన్నారు. తనపై ప్రేమాభిమానాలు చూపించిన ప్రతి ఒక్కరికీ రాహుల్ కృతజ్ఞతలు తెలిపారు.తాను ఏం చేయాన్న దానిపై పూర్తి స్పష్టత ఉందని రాహుల్ అన్నారు.
అనర్హత పిటీషన్పై…
ఏం జరిగినా తన రూట్ క్లియర్గా ఉందని అన్నారు. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై సూరత్ సెషన్స్ కోర్టులో పరువు నష్టం కేసు దాఖలయిన నేపథ్యంలో ఆ కోర్టు రెండేళ్ల శిక్ష విధించిన సంగతి తెలిసిందే. రెండేళ్లు శిక్ష విధించడంతో ప్రజాప్రాతినిధ్యం చట్టం ప్రకారం రాహుల్ ఎంపీ పదవికి అనర్హుడిగా లోక్సభ సెక్రటేరియట్ సర్క్యులర్ జారీ చేసింది. దీనిపై గుజరాత్ హైకోర్టుకు వెళ్లిన రాహుల్, అక్కడ కూడా తనకు న్యాయం జరగలేదని భావించి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చివరకు సుప్రీంకోర్టులో రాహుల్కు ఊరట లభించింది.