పుంగనూరు నియోజకవర్గంలో జరిగిన ఘర్సణలపై వైసీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. చంద్రబాబు కావాలనే గొడవలు సృష్టిస్తున్నారని సజ్జల ఆరోపించారు. చంద్రబాబు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నప్పటికీ వైసీపీ కార్యకర్తలు సంయమనంతో వ్యవహరిస్తున్నారని సజ్జల అన్నారు. రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ గొడవలు సృష్ఠించాలని ప్రయత్నిస్తున్నారన్నారు.
అధికారంలోకి వచ్చేందుకు…
రాయలసీమలో గొడవలకు చంద్రబాబే బాధ్యత వహించాలని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అంగళ్లులో తెలుగుదేశం పార్టీ నేతలు పథకం ప్రకారమే అల్లర్లకు దిగారన్నారు. విధ్వంసం సృష్టించారన్నారు. టీడీపీ శ్రేణులు జరిపిన రాళ్ల దాడుల్లో పోలీసులకు కూడా గాయాలయ్యాయని, శాంతిభద్రతల సమస్యను సృష్టించే ప్రయత్నంలో భాగంగానే ఈ దాడులకు తెగబడుతున్నారన్నారు. చంద్రబాబు అధికారంలోకి రావడం కోసం ఎంతకైనా తెగిస్తారని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు.